మే 29 నుంచి మస్కట్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

- May 28, 2020 , by Maagulf
మే 29 నుంచి మస్కట్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

మస్కట్:కోవిడ్‌-19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ, మే 29 నుంచి మస్కట్‌లో లాక్‌డౌన్‌ని ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది. మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ సయ్యిద్‌ హమౌద్‌ బిన్‌ ఫైసల్‌ అల్‌ బుసైది నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరవ్వాలని సుప్రీం కమిటీ సూచించింది. కాగా, ముట్రాహ్‌ హెల్త్‌ ఐసోలేషన్‌ ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, కొంతమంది ఉద్యోగులు తమ యాన్యువల్‌ లీవ్స్‌ని వినియోగించుకోవచ్చని కూడా సుప్రీం కమిటీ సూచించింది. హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌, సెలవుల విషయమై సరైన నిర్ణయం తీసుకుంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు మాత్రం కొన్నాళ్ళపాటు తీసుకోవాల్సి వుంటుందని సుప్రీం కమిటీ అభిప్రాయపడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com