కువైట్: సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..అధికారుల హెచ్చరిక
- May 28, 2020
సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రభుత్వ విధి విధానాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కువైట్ ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు అల్లి అసత్య పోస్టులు పెట్టే వారిని ఎట్టిపరిస్థితుల్లోని ఉపేక్షించబోమని సమాచార సాంకేతిక నియంత్రణ అధికారులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై తమను తాము ప్రముఖ వ్యక్తులుగా చిత్రీకరించుకుంటూ అబద్ధపు పోస్టులతో ప్రజలు అయోమయానికి గురి చేస్తున్నారని కూడా తెలిపారు. అలాంటి వారిపై ఎప్పటికప్పుడు తమ పర్యవేక్షణ కొనసాగుతుందని..వారి ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ ను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించే వారు కూడా అలాంటి పోస్టుల పట్ల అప్రత్తంగా ఉండాలని, అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాకే షేర్ చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







