కువైట్: సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..అధికారుల హెచ్చరిక
- May 28, 2020
సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రభుత్వ విధి విధానాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కువైట్ ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు అల్లి అసత్య పోస్టులు పెట్టే వారిని ఎట్టిపరిస్థితుల్లోని ఉపేక్షించబోమని సమాచార సాంకేతిక నియంత్రణ అధికారులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై తమను తాము ప్రముఖ వ్యక్తులుగా చిత్రీకరించుకుంటూ అబద్ధపు పోస్టులతో ప్రజలు అయోమయానికి గురి చేస్తున్నారని కూడా తెలిపారు. అలాంటి వారిపై ఎప్పటికప్పుడు తమ పర్యవేక్షణ కొనసాగుతుందని..వారి ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ ను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించే వారు కూడా అలాంటి పోస్టుల పట్ల అప్రత్తంగా ఉండాలని, అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాకే షేర్ చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు