177 మంది బాలికల కోసం విమానం ఏర్పాటు చేసిన సోను సూద్
- May 29, 2020కేరళ:వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసి అందరి అభిమానం అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ అక్కడితో తన సహాయాన్ని ఆపలేదు. ప్రతి రోజూ వలస కూలీలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు. ఒక్క వలస కూలీలనే కాదు తన సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు. తాజాగా కేరళలో చిక్కుకున్న 177 మంది బాలికలను విమానంలో వారి రాష్ట్రానికి పంపించారు. ఈ అమ్మాయిలంతా కేరళలోని ఓ కుట్టు మిషన్ కర్మాగారంలో పని చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. సోనూ స్నేహితుడొకరు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. దాంతో వెంటనే సోనూ ఆ అమ్మాయిలందరికీ సహాయం చేయదలచి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు నడపడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు. ఒక ప్రత్యేక విమానంలో వారిని కొచ్చి నుండి భువనేశ్వర్ చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వారు తమ ఇళ్లకు చేరుకుంటారు. సోనూ సూద్ సహాయం పొందిన ఓ గర్భిణీ తన కొడుక్కి సోనూ సూద్ శ్రీవాత్సవ అని పెట్టుకుంది. ఆ విషయం తెలిసి సోనూ తన హృదయం ఉప్పొంగి పోయిందన్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు