సెప్టెంబర్‌లో హరామైన్‌ ట్రెయిన్‌

- June 02, 2020 , by Maagulf
సెప్టెంబర్‌లో హరామైన్‌ ట్రెయిన్‌

జెడ్డా: హరామైన్‌ ట్రెయిన్‌ తిరిగి సెప్టెంబర్‌లో పట్టాలెక్కనుంది. ఈ మేరకు హరామైన్‌ హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్ట్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. మక్కా మరియు మదీనా మధ్య ప్రయాణీంచేవారి కోసం దీన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రద్దీని తట్టుకునేలా అన్ని డెస్టినేషన్స్‌ని కవర్‌ చేసేలా వర్క్‌ చాలా వేగంగా నడుస్తోందని హరామైన్‌ రైల్‌ ప్రాజెక్ట్‌ పేర్కొంది. జులై నుంచి ఆగస్ట్‌ మధ్యలో కెపాసిటీని పెంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఏ తేదీ నుంచి హరామైన్‌ ట్రెయిన్‌ తిరిగి పట్టాలెక్కుతుందన్నదానిపై సమాచారం వెల్లడించలేమని లేదని నిర్వాహకులు తెలిపారు. ఆగస్ట్‌లో మాత్రం ఇ-టిక్కెట్స్‌ని బుక్‌ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com