శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి...
- June 02, 2020తిరుమల:శ్రీవారి దర్శనానికి భక్తులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో తిరుమలకు భక్తులును వెళ్లకుండా నిలిపివేశారు. అయితే, లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో భక్తులకు అనుమతి లభించింది. అయితే, ముందుగా శ్రీవారి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అయితే, కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు ఆరు అడుగులు దూరం పాటించాలని అన్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు దర్శనానికి అనుమతి కోరుతూ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం