యూఏఈలో నిర్మాణ రంగ కార్మికులకు జూన్ 15 నుంచి మిడ్ బ్రేక్ అమలు
- June 03, 2020యూఏఈ:వేసవిలో కార్మికుల ఆరోగ్య భద్రత కోసం మిడ్ డే బ్రేక్ ను ఈ నెల 15 నుంచి అమలులోకి రానుంది. నిబంధనల మేరకు మూడు నెలల పాటు మిడ్ డే బ్రేక్ అమలులో ఉంటుంది. అంటే సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నన విరామ సమాయాన్ని అన్ని నిర్మాణ రంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్ననం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు మూడు గంటలు బ్రేక్ టైంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే..అత్యవసర పనులకు మాత్రం మిడ్ డే బ్రేక్ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కానీ, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఖచ్చితంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పని ప్రదేశాల్లో చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. అలాగే కార్మికులు డీహైడ్రెషన్ (నిస్సత్తువగా)కు గురికాకుండా శక్తినిచ్చే పానియాలను కూడా ఇవ్వాలని మానవ వనరులు, ఎమిరైజేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు సూచించారు. అలాగే కార్మికులు సొమ్మసిల్లిపోయే అవకాశాలు ఉండటంతో ప్రాథమిక చికిత్సకు అవసరమైన కిట్ ను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇదిలాఉంటే మధ్యాహ్నన విరామ సమయంలో కార్మికులు సేద తీరేందుకు ఎండ తగలని ప్రాంతాన్ని ఆయా యాజమాన్యాలే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కార్మికుల పనివేళలు 8 గంటలకు మించితే ఎక్కువ వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లఘిస్తే Dh5,000 నుంచి Dh50,000 వరకు జరిమాన విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..