యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో ఎయిర్ పోర్టుల పునఃప్రారంభం
- June 04, 2020
యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో విమానాశ్రయాల్ని నిర్వహించేందుకు యూఏఈ అనుమతులు జారీ చేసింది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలకు ఈ అనుమతులు జారీ అయ్యాయి. అబుధాబి, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాలకు ఈ సంస్థలు సేవలు అందిస్తాయని నేషనల్ క్రౌసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికార ప్రతినిది¸ డాక్టర్ సైఫ్ అల్ దహెరి చెప్పారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కేవలం ట్రాన్సిట్ మరియు ప్రత్యేక విమానాలు మాత్రమే నడుస్తున్నాయి ఆయా విమానాశ్రయాల నుంచి. కరోనా వైరస్ నేపథ్యంలో, అన్ని విభాగాలూ అప్రమత్తంగా వున్నాయనీ, సంబంధిత ప్రోటోకాల్స్కి అనుగుణంగా అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







