యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో ఎయిర్ పోర్టుల పునఃప్రారంభం
- June 04, 2020
యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో విమానాశ్రయాల్ని నిర్వహించేందుకు యూఏఈ అనుమతులు జారీ చేసింది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలకు ఈ అనుమతులు జారీ అయ్యాయి. అబుధాబి, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాలకు ఈ సంస్థలు సేవలు అందిస్తాయని నేషనల్ క్రౌసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికార ప్రతినిది¸ డాక్టర్ సైఫ్ అల్ దహెరి చెప్పారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కేవలం ట్రాన్సిట్ మరియు ప్రత్యేక విమానాలు మాత్రమే నడుస్తున్నాయి ఆయా విమానాశ్రయాల నుంచి. కరోనా వైరస్ నేపథ్యంలో, అన్ని విభాగాలూ అప్రమత్తంగా వున్నాయనీ, సంబంధిత ప్రోటోకాల్స్కి అనుగుణంగా అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'