ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 04, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 29 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.నిన్న ఒక్క రోజు కోవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 19 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చిన వారు ఉన్నారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,377 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 2,273 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 71కు చేరగా, ప్రస్తుతం 1,033 మంది వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com