భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
- June 08, 2020
రెండు నెలలు లాక్డౌన్ చేసిన తర్వాత ప్రభుత్వం అనేక సడలింపులను అనుమతించినప్పటికీ, 24 గంటల్లో 9,983 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా గత 24 గంటల్లో 206 మంది మరణించారు. తాజా కేసులతో భారత్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 2.56 లక్షల కేసులను దాటాయి. ప్రభుత్వ డేటా ప్రకారం వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 7,135 గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2,56,611 ఉండగా.. ఇందులో 1,24,095 మంది కోలుకున్నారు.
భారతదేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 48.35 శాతంగా ఉంది, అయితే ఇందులో వృద్ధి రేటు 3.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది.. మొత్తం 85,000 కేసులతో చైనా సంఖ్యను అధిగమించింది. రాష్ట్రంలో 3 వేలకు పైగా మరణించారు.. మహారాష్ట్ర రాజధాని ముంబై.. దేశంలో అత్యంత నష్టపోయిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఆ తరువాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?