మస్కట్:కరోనా ట్రీట్మెంట్ కోసం బ్లడ్ ప్లాస్మా ఇచ్చిన మున్సిపాలిటి ఉద్యోగులు
- June 09, 2020
మస్కట్ మున్సిపాలిటిలోని కొందరు ఉద్యోగులు కోవిడ్ 19 నుంచి పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నారు. బ్లడ్ ప్లాస్మా ఇచ్చేందుకు 33 మంది ఉద్యోగులు ముందుకు వచ్చారు. కోవిడ్ 19ని అరికట్టేందుకు వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తుల బ్లడ్ ప్లాస్మా..ట్రీట్మెంట్లో ఎంతో దోహదం చేస్తుందనేది తెలిసిన విషయమే. ఆ దిశగా పలు దేశాలు కోవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కరోనా పేషెంట్ శరీరంలోకి పంపించి కరోనాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒమన్ లోని బ్లడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. DBBS పిలుపుతో మస్కట్ మున్సిపాలిటికి చెందిన 33 మంది ఉద్యోగులు ప్లాస్మా దానం చేశారు. అయితే..తమకు O+, A+, B+, AB+ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్లాస్మా దాతలు కావాలని, ఆయా గ్రూప్ లు ఉన్న వారు ప్లాస్మా దానం చేయాలనుకుంటే 94555648 నెంబర్ కు వాట్సాప్ చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు