మస్కట్:కరోనా ట్రీట్మెంట్ కోసం బ్లడ్ ప్లాస్మా ఇచ్చిన మున్సిపాలిటి ఉద్యోగులు
- June 09, 2020
మస్కట్ మున్సిపాలిటిలోని కొందరు ఉద్యోగులు కోవిడ్ 19 నుంచి పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నారు. బ్లడ్ ప్లాస్మా ఇచ్చేందుకు 33 మంది ఉద్యోగులు ముందుకు వచ్చారు. కోవిడ్ 19ని అరికట్టేందుకు వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తుల బ్లడ్ ప్లాస్మా..ట్రీట్మెంట్లో ఎంతో దోహదం చేస్తుందనేది తెలిసిన విషయమే. ఆ దిశగా పలు దేశాలు కోవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కరోనా పేషెంట్ శరీరంలోకి పంపించి కరోనాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒమన్ లోని బ్లడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. DBBS పిలుపుతో మస్కట్ మున్సిపాలిటికి చెందిన 33 మంది ఉద్యోగులు ప్లాస్మా దానం చేశారు. అయితే..తమకు O+, A+, B+, AB+ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్లాస్మా దాతలు కావాలని, ఆయా గ్రూప్ లు ఉన్న వారు ప్లాస్మా దానం చేయాలనుకుంటే 94555648 నెంబర్ కు వాట్సాప్ చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







