వందే భారత్ మిషన్ 3: యూఏఈ నుంచి ఇండియాకు 45 ఫ్లైట్లు
- June 10, 2020
యూఏఈ:లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన ప్రవాసీయులను భారత్ తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ మూడో దశ షెడ్యూల్ ప్రకటించారు అధికారులు. యూఏఈ నుంచి భారత్ కు మొత్తం 45 విమాన సర్వీసులను నడపనున్నారు. అయితే..ఇందులో 44 సర్వీసులు కేరళకు కేటాయించారు. మరో సర్వీసును మాత్రం ఒడిషాకు నడపనున్నారు. మొత్తం విమాన సర్వీసులను కేరళకే కేటాయించటం పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దీంతో వాళ్లంతా రెండో దశ వందే భారత్ మిషన్ లోని విమాన సర్వీసులపైనే ఆశలు పెంచుకున్నారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా షెడ్యూల్ చేసిన విమాన సర్వీసుల్లో తమకు సీట్లు కన్ఫమ్ కావాలని ఆశిస్తూ ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ రెండో దశలో భాగంగా ఈ నెల 9 నుంచి 19 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. సెకండ్ ఫేజ్ లో మొత్తం 25 విమాన సర్వీసులను ప్రకటించగా అందులో 8 కేరళకు నడపనున్న విషయం తెలిసింది. అయితే..ఆ తర్వాత షెడ్యూల్ ను సవరించి మరో 5 విమానాలను ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, హైదరాబాద్, లక్నో నగరాలకు ఈ నెల 21, 23న నడపనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







