ఏపీలో కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు

- June 11, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో బుధవారం నుంచి గురువారం 11 గంటల వరకూ మొత్తం 11,602 శాంపిల్స్ ను పరీక్షించగా. కొత్తగా మరో 135 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య తాజా బులిటెన్ ద్వారా వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4261కి చేరింది.

అలాగే గత 24 గంటల్లో 65మంది సంపూర్నంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2540 మంది కోలుకుని వివిధ జిల్లాల్లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 1641 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకూ 80 మంది మృతి చెందారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com