తెలంగాణలో కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు
- June 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా మరో 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,974కు చేరింది. ఆదివారం రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 185 మంది చనిపోయారు.
కొత్తగా వచ్చిన కేసుల్లో 195 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన వాటిలో మేడ్చల్ 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5, మంచిర్యాల 3, వరంగల్ అర్బన్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో రెండేసి చోప్పున, మెదక్, సిరిసిల్లా, అదిలాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన