అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకు కుదింపు – జగన్ నిర్ణయం
- June 15, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిప్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వర్షాకాలంలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగించే విధంగా ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఈ రెండు రోజుల సమావేశాల్లో కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం, కొన్ని కీలక బిల్లుల్ని పాస్ చేయడం మాత్రమే జరుగనుంది.
సుదీర్ఘ చర్చలకు ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 16 నుంచి 20 తేదీలలో రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు జరనున్నట్టు సమాచారం. మొదటి రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగం, అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా అదే రోజు ప్రవేశపెట్టడం.. బడ్జెట్ కు ఆమోదం పొందిన మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కోవిద్-29 దృష్ట్యా సమావేశాలకు హాజరు కాబోయే నేతలందరికీ రేపటి నుండి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు. సభ్యుల వ్యక్తిగత సిబ్బంది, విజిటర్లకు కూడా ఈసారి అసెంబ్లీలోకి ప్రవేశం కల్పించడం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







