ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే కఠిన చర్యలు:సైబర్ పోలీసు
- June 15, 2020
ముంబై:అసలే బాధలో ఉన్న అభిమానులకు ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయొద్దని మహారాష్ట్ర సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి ఫోటోలను షేర్ చేయడం చట్టరీత్యా నేరమని ఒకవేళ ఇప్పటికే షేర్ చేసి ఉంటే డిలీట్ చేయమని కోరుతున్నారు. ఈ మేరకు సుశాంత్ అభిమానులు సైబర్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు.
వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. డెబ్ బాడీ ఫోటోలను చూసి తట్టుకోలేకపోతున్నామని.. దయచేసి అలాంటివి షేర్ చేయనీయకుండా చూడండి అని అభిమానులు పోలీసులను కోరారు. మా అభిమాన హీరో నవ్వును మాత్రమే చూడాలనుకుంటున్నామని తెలిపారు. సుశాంత్ మరణంతో బాలీవుడ్ కన్నీటి సంధ్రమైంది. ఓ మంచి నటుడిని కోల్పోయామని ఆయన నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు