జూన్ 23 నుంచి విదేశాల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్..ప్రకటించిన యూఏఈ
- June 16, 2020
యూఏఈ:కరోనా తర్వాత సాధారణ జనజీవన పునరుద్ధరణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి దేశ పౌరులు, ప్రవాసీయుల విదేశీ ప్రయాణాలకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అయితే..యూఏఈ నుంచి ఏయే గమ్యస్థానాలకు అనుమతి ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. అయితే..కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు..ఎప్పుడు తిరిగి వస్తారు..తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రయాణ సమయంలో వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?