జూన్ 23 నుంచి విదేశాల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్..ప్రకటించిన యూఏఈ

- June 16, 2020 , by Maagulf
జూన్ 23 నుంచి విదేశాల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్..ప్రకటించిన యూఏఈ

 యూఏఈ:కరోనా తర్వాత సాధారణ జనజీవన పునరుద్ధరణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి దేశ పౌరులు, ప్రవాసీయుల విదేశీ ప్రయాణాలకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అయితే..యూఏఈ నుంచి ఏయే గమ్యస్థానాలకు అనుమతి ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. అయితే..కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు..ఎప్పుడు తిరిగి వస్తారు..తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రయాణ సమయంలో వెల్లడించనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com