మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ నేడు అనంతపురంకి రాక..
- February 01, 2016
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి రానున్నారు. ఉపాధి హామీ పథకాన్ని బండ్లపల్లిలో ప్రారంభించి మంగళవారానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పీసీసీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీరు పాల్గొంటారు. కాగా, రాహుల్గాంధీ బెంగళూరు నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బండ్లపల్లి చేరుకొని సర్పంచ్లు, ఉపాధి హామీ కూలీలతో సమావేశమవుతారు.ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి.. బహిరంగ సభలో పాల్గొంటారు.ఆయన తిరిగి 4.30 గం.కు బెంగళూరు వెళ్తారని పార్టీ నేతలు తెలిపారు. ఉపాధి హామీ చట్టం అమలయ్యేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటూ కూలీలకు భరోసా కల్పించేందుకు రాహుల్, మన్మోహన్తో పాటు జాతీయనేతలు బండ్లపల్లికి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా వెల్లడించారు. కాగా, ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







