బాలయ్య బావ కోసం యాగం
- February 01, 2016
పాలనలో చిక్కులు, చికాకులు ఎదుర్కొంటున్న తన వియ్యంకుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సేఫ్టీ కోసం యాగం, హోం చేయాలని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారట. దీనిపై ఇప్పటికే ఆయన జ్యోతిష్కులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి రాహువు.. గురు గ్రహంతో కలిసి సింహలగ్నంలో ప్రవేశించాడని, అది పాలకులకు శుభప్రదం కాదని జ్యోతిష్కులు చెప్పారని తెలిసింది. పైగా గ్రహాల సంచార ఫలితంగా అమరావతి కొత్త రాజధాని నిర్మాణంలో జాప్యం జరగవచ్చునని కూడా అభిప్రాయపడ్డారట.ఈ నేపథ్యంలో జ్యోతిష్యం మీద ఎంతో నమ్మకం వున్న బాలయ్య, ముఖ్యంగా.. చంద్రబాబుకు శుభం జరగాలని కోరుతూ ప్రత్యేక హోమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఈ హోమ, యాగాలకు పెద్దగా పబ్లిసిటీ ఇవ్వరాదని ఆయన సూచించినట్టు చెబుతున్నారు. గురు-రాహువుల గ్రహాల కలయిక దేశానికి, రాష్ర్టానికీ మంచిదికాదని రాష్ర్ట ప్రభుత్వ ఆగమ సలహాదారు, కాంచీపీఠం ఆస్థాన జ్యోతిష్కుడు ఎల్ సుబ్రమణ్యం సిద్ధాంతి అంటున్నారు. ఈ గ్రహాల వల్ల పాలకులకు మంచి జరగదని, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చన్నది ఆయన వివరణ. మంచి జరగాలంటే రాజశ్యామల సంపూతిత పాశుపత మహాయాగం నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







