దోహా:కార్మికుల వేసవి పని వేళల నిబంధనల ఉల్లంఘన..56 కంపెనీలకు జరిమానా

- June 20, 2020 , by Maagulf
దోహా:కార్మికుల వేసవి పని వేళల నిబంధనల ఉల్లంఘన..56 కంపెనీలకు జరిమానా

దోహా:వేసవి కాలానికి సంబంధించి కార్మికుల పనివేళల నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు చేపట్టింది కార్మిక, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ. నిబంధనలు పాటించని 56 కంపెనీలపై జరిమానాలు విధించింది. ఈ వేసవిలో (జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు) పగటి వేళల్లో కార్మికులకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించాల్సిందేనని మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ఎండతగిలే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో పని చేయనీయకూడదు. పైగా కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. ఈ నిబంధనలు అన్ని కంపెనీ యాజమాన్యాలు ఎంతవరకు పాటిస్తున్నాయో పరిశీలించేందుకు కార్మిక సాంఘిక సంక్షేమ శాఖ ఈ నెల 15 నుంచి 18 వరకు తనిఖీలు చేపట్టింది. ఈ మూడు రోజుల సోదాల్లో ఖతార్ లో వివిధ ప్రాంతాల్లోని 56 కంపెనీలు వేసవి పని వేళల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆ 56 కంపెనీలకు జరిమానా విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com