కువైట్ : కరోనాతో మరణించిన సెంట్రల్ జైలు ఖైదీ

- June 23, 2020 , by Maagulf
కువైట్ : కరోనాతో మరణించిన సెంట్రల్ జైలు ఖైదీ

కువైట్ లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ కరోనాతో చనిపోయినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని భద్రత పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు. 59 ఏళ్ల మహిళా ఖైదీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావటంతో...ఈ నెల 15న ఆమెను ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అల్ ఫర్వానియా ఆస్పత్రిలో వారం పాటు చికిత్స అందించిన తర్వాత ఆమె శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొని మరణించినట్లు వెల్లడించారు. అయితే..ఆమెకు ఇతర రోగాలు కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోలేకపోయినట్లు చెబుతున్నారు. మహిళా ఖైదీ కరోనా బారిన పడటంతో జైలులో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఇతర ఖైదీలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com