కువైట్ : కరోనాతో మరణించిన సెంట్రల్ జైలు ఖైదీ
- June 23, 2020
కువైట్ లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ కరోనాతో చనిపోయినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని భద్రత పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు. 59 ఏళ్ల మహిళా ఖైదీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావటంతో...ఈ నెల 15న ఆమెను ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అల్ ఫర్వానియా ఆస్పత్రిలో వారం పాటు చికిత్స అందించిన తర్వాత ఆమె శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొని మరణించినట్లు వెల్లడించారు. అయితే..ఆమెకు ఇతర రోగాలు కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోలేకపోయినట్లు చెబుతున్నారు. మహిళా ఖైదీ కరోనా బారిన పడటంతో జైలులో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఇతర ఖైదీలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?