ఏపీలో మరో 448 కరోనా కేసులు

- June 24, 2020 , by Maagulf
ఏపీలో మరో 448 కరోనా కేసులు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. గత 24 గంటల్లో మొత్తం 36,047 మంది నమూనాలను పరీక్షించగా 448 పాజిటివ్ కేసులొచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8306 కు చేరింది. కొత్తగా 146 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. దాంతో మొత్తం కేసులలో ఇప్పటివరకూ 3712 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 129 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4465 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com