తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

- June 25, 2020 , by Maagulf
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం కొత్తగా 920 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న మంది 4,688 డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,446 ఉన్నాయి. నేడు కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 230గా నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 737 ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com