దుబాయ్:బస్ సర్వీసుల్లో నాణ్యత పెంచేలా స్మార్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌..

- June 25, 2020 , by Maagulf
దుబాయ్:బస్ సర్వీసుల్లో నాణ్యత పెంచేలా స్మార్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌..

దుబాయ్:ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు దుబాయ్‌ రోడ్డు రవాణా అధికారులు. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలాహాలు కోరుతూ ప్రతి బస్సు డిపోల్లోనూ ప్రత్యేకంగా ట్యాబ్‌లు ఏర్పాట్లు చేసింది. ఈ స్మార్ట్‌ సిస్టం ద్వారా బస్సు డ్రైవర్లు తమ ప్రయాణం తర్వాత ఏమైన లోటు పాట్లు ఉన్నా, కొత్త ఆలోచనలు, సలహాలు రోడ్డు, రవాణా అధికారులతో పంచుకోవచ్చు. డ్రైవర్ల సలహాలు ఆమోదయోగ్యంగా ఉంటే వాటిని అమలు చేసేందుకు వెనుకడబోమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. స్ట్రాటజిక్‌ లక్ష్యాలను సాధించేందుకు, డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్మార్ట్ విధానంతో మెరుగైన ఆలోచనలను పంచుకునే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com