దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం
- June 26, 2020
భారత దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది.
ఇంజనీర్లు, కార్మికులు వంటి పలు శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కనీస వేతనాన్ని 170 శాతానికి పెంచింది. రిస్క్ అలవెన్స్ ను 100 నుంచి 170 శాతానికి పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ వేతనాలు జూన్ 1,2020 నుంచి అమల్లోకి రానున్నాయి.
జాతీయ హైవేలు..మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తించనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







