వందేభారత్ మిషన్ : ఒమన్ లోని భారతీయులను తరలించేందుకు మరో 16 విమాన సర్వీసులు
- June 26, 2020
ఒమన్:ప్రపంచదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు విమాన సర్వీసుల షెడ్యూల్ ను ప్రకటిస్తూ వస్తోంది కేంద్రం. లేటెస్ట్ ఒమన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు మరో 16 విమాన సర్వీసులను నడపున్నట్లు భారత్ ప్రకటించింది. నాలుగో దశ వందేభారత్ మిషన్ లో భాగంగా జులై 1 నుంచి 16 విమానాలు ఒమన్ నుంచి భారత్ కు నడపనున్నట్లు వివరించారు. ఈ 16 విమానసర్వీసులలో 12 విమానాలు కేరళాకు నడపనున్నారు. మిగిలిన నాలుగు విమానాలను హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైకి నడపనున్నారు. అయితే..ఈ విమానాల్లో టికెట్ల బుకింగ్ గతంలో అనుసరించిన విధానాలనే అనుసరించనున్నారు. గర్భిణులు, మెడికల్ ఎమర్జెన్సీ, సీనియర్ సిటిజన్స్, ఉపాధి కొల్పోయి ఒత్తిడిలో ఉన్న కార్మికులకు తొలి ప్రధాన్యత ఇవ్వనున్నారు. టికెట్లు బుక్ అయిన వారికి ఈ మెయిల్ ద్వారాగానీ, ఫోన్ ద్వారాగానీ సమాచారం అందిస్తారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







