దుబాయ్ - పంజాబ్ కు గురు నానక్ గురుద్వారా వారి ఆధ్వర్యంలో తొలి రిపాట్రియేషన్ చార్టర్ ఫ్లైట్
- June 26, 2020
దుబాయ్ : అనుకున్న షెడ్యూల్ ప్రకారమే దుబాయ్ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కు ఛార్టర్డ్ ఫ్లైట్ బయల్దేరింది. లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా తొలి విమానం దాదాపు 209 మంది భారత ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయల్దేరారు. దుబాయ్ లోని గరుద్వారా గురునానక్ దర్బార్ వారు ఈ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో అమృత్ సర్ కు మరిన్ని ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నారు. తొలి విమానం గురువారం టేకాఫ్ కాగా..రెండో విమానం ఈ నెల 27న బయల్దేరుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మొత్తం 6 ప్రత్యేక విమానాలను పంజాబ్ నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు తోడ్పాటు అందించిన దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులకు గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ ఖాందారి కృతజ్ఞలు తెలిపారు.
_1593156108.jpg)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







