జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్
- June 26, 2020
న్యూ ఢిల్లీ:కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జులై 15 వరకు ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలపై బ్యాన్ విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని వెల్లడించింది. వీటిలో డీజీసీఏ పర్మిషన్ పొందిన.. కార్గో రవాణా ఫ్లైట్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివరించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని వెల్లడించింది.
కరోనావైరస్ సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 న భారతదేశం అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సడలింపుల్లో భాగంగా మే 25 నుండి దేశీయ విమానాలను అనుమతించారు. మే 6 నుండి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో చిక్కుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలలాకు తరలించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







