వందే భారత్‌ మిషన్‌ 4: గల్ఫ్ పై స్పెషల్‌ ఫోకస్‌

- June 27, 2020 , by Maagulf
వందే భారత్‌ మిషన్‌ 4: గల్ఫ్ పై స్పెషల్‌ ఫోకస్‌

గల్ఫ్ సహా పలు దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో ఫేజ్‌ వందే భారత్‌ మిషన్‌, పూర్తిగా గల్ఫ్ మీద ఫోకస్‌తో చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. జిసిసి దేశాలు అలాగే మలేసియా, సింగపూర్‌ సహా కొన్ని దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలించనున్నామని భారత మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చెప్పారు. జులై 3 నుంచి నాలుగో ఫేజ్‌ వందే భారత్‌ మిషన్‌ చేపట్టనున్నట్లు పేర్కొన్నారాయన. ఇప్పటికే వందే భారత్‌ మిషన్‌ ద్వారా 3,64,209 మంది భారతీయుల్ని 50 దేశాల నుంచి ఐదు ఖండాల నుంచి స్వదేశానికి తరలించిన విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com