కర్ఫ్యూ తర్వాత తొలిసారిగా పవిత్ర మక్కాలోని మసీదులల్లో ప్రార్ధనలు
- June 27, 2020
సౌదీ: కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత పవిత్ర మక్కాలోని మసీదులలో తొలి సారిగా శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించారు. ఇన్నాళ్లుకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండటంతో మసీదులలో ప్రార్ధనలకు అనుమతి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సౌదీ అరేబియాలో వారం క్రితం కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేశారు. దీంతో కర్ఫ్యూ ఎత్తివేసిన తొలి శుక్రవారం రోజున మసీదులలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే...ప్రార్ధనలకు 20 నిమిషాల ముందు మసీదులను తెరిచి భక్తులకు అనుమతించారు. అదేవిధంగా ప్రార్ధనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మసీదులను మూసివేశారు. అంతేకాకుండా ప్రార్ధన సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్న మార్గనిర్దేశకాల మేరకు వ్యక్తికి వ్యక్తికి మధ్య రెండు మీటర్ల దూరం ఉండి ప్రార్ధనలు నిర్వహించారు. ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు ఎవరి మ్యాట్ లను వారే తెచ్చుకున్నారు. అలాగే కరోనా నియంత్రణలో భాగంగా టాయిలెట్లను మూసివేయటంతో పాటు చిన్నపిల్లలను ప్రార్ధనలకు అనుమతించలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?