కర్ఫ్యూ తర్వాత తొలిసారిగా పవిత్ర మక్కాలోని మసీదులల్లో ప్రార్ధనలు
- June 27, 2020
సౌదీ: కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత పవిత్ర మక్కాలోని మసీదులలో తొలి సారిగా శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించారు. ఇన్నాళ్లుకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండటంతో మసీదులలో ప్రార్ధనలకు అనుమతి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సౌదీ అరేబియాలో వారం క్రితం కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేశారు. దీంతో కర్ఫ్యూ ఎత్తివేసిన తొలి శుక్రవారం రోజున మసీదులలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే...ప్రార్ధనలకు 20 నిమిషాల ముందు మసీదులను తెరిచి భక్తులకు అనుమతించారు. అదేవిధంగా ప్రార్ధనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మసీదులను మూసివేశారు. అంతేకాకుండా ప్రార్ధన సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్న మార్గనిర్దేశకాల మేరకు వ్యక్తికి వ్యక్తికి మధ్య రెండు మీటర్ల దూరం ఉండి ప్రార్ధనలు నిర్వహించారు. ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు ఎవరి మ్యాట్ లను వారే తెచ్చుకున్నారు. అలాగే కరోనా నియంత్రణలో భాగంగా టాయిలెట్లను మూసివేయటంతో పాటు చిన్నపిల్లలను ప్రార్ధనలకు అనుమతించలేదు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







