దుబాయ్:జులై 5 నుంచి ఫెడరల్ ఉద్యోగులంతా విధులకు హజరుకావాలని ఆదేశాలు
- June 30, 2020దుబాయ్:ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక నుంచి విధులకు హజరుకావాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. జులై 5న ఉద్యోగలు తమ ఆఫీసులలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే..వారు అధికారిక కమిటీ ఆమోదించిన మెడికల్ రిపోర్ట్స్ ని ఆఫీసులలో సమర్పించాలి. గతంలో కొన్ని వర్గాల వారికి ఆఫీసులకు రాకుండా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గర్భిణులు, పెద్ద వయస్కులు, 9వ గ్రేడ్ కన్న తక్కువ చదువుతున్న పిల్లల తల్లులకు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ నెల నుంచే 50 శాతం ఉద్యోగులతో సాధారణ సేవలు ప్రారంభించారు. ఇదిలాఉంటే 100 శాతం సిబ్బందితో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 15 నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక షార్జా ప్రభుత్వ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో సేవలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్