షార్జా:నిర్లక్ష్యంగా వదిలేసిన 400 కార్లను సీజ్ చేసిన పోలీసులు
- June 30, 2020
షార్జా:నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను గుర్తించి సీజ్ చేశారు షర్జా పోలీసులు. షర్జా మున్సిపాలిటి అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తొలుత 419 వాహానాలను సీజ్ చేశారు. నగరంలో వాహనాల ఓనర్లు బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. అలా వదిలివేసిన వాహనాలు చోరీలకు ఊతం ఇచ్చేలా మారుతున్నాయని, కొన్ని సార్లు దొంగలు కార్లనే మాయం చేసేస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో కార్లలోని విడి భాగాలను దొంగిలిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలు షార్జా నగర ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. అందువల్ల నగరంలో నిర్లక్ష్యంగా వదిలివేయబడిన కార్ల ఓనర్లు బాధ్యతయుతంగా వ్యవహరించి వాటిని తీసివేయాలన్నారు. 48 గంటల్లో వాహనాలను తొలగించకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







