షార్జా:నిర్లక్ష్యంగా వదిలేసిన 400 కార్లను సీజ్ చేసిన పోలీసులు
- June 30, 2020
షార్జా:నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను గుర్తించి సీజ్ చేశారు షర్జా పోలీసులు. షర్జా మున్సిపాలిటి అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తొలుత 419 వాహానాలను సీజ్ చేశారు. నగరంలో వాహనాల ఓనర్లు బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. అలా వదిలివేసిన వాహనాలు చోరీలకు ఊతం ఇచ్చేలా మారుతున్నాయని, కొన్ని సార్లు దొంగలు కార్లనే మాయం చేసేస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో కార్లలోని విడి భాగాలను దొంగిలిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలు షార్జా నగర ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. అందువల్ల నగరంలో నిర్లక్ష్యంగా వదిలివేయబడిన కార్ల ఓనర్లు బాధ్యతయుతంగా వ్యవహరించి వాటిని తీసివేయాలన్నారు. 48 గంటల్లో వాహనాలను తొలగించకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







