బహ్రెయిన్:ప్రవేట్ ఉద్యోగులకు ఊరట..50% వేతనాలు చెల్లించనున్న ప్రభుత్వం

- June 30, 2020 , by Maagulf
బహ్రెయిన్:ప్రవేట్ ఉద్యోగులకు ఊరట..50% వేతనాలు చెల్లించనున్న ప్రభుత్వం

మనామా:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి ప్రైవేట్ సెక్టార్ లోని ఉద్యోగులకు ప్రభుత్వమే 50 శాతాం చెల్లించనుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన కంపెనీలకు తమ సాయం అందుతుందని ప్రకటించింది. జులై నుంచి 50 శాతం జీతాల చెల్లింపులు ప్రారంభించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం..తద్వారా బహ్రెయిన్ దాదాపు లక్ష మంది ప్రైవేట్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని వివరించింది. ఇక బహ్రెయిన్ పౌరులకు కూడా ఆర్ధికంగా కొంత వెసులుబాటు కలిగేలా గతంలో ప్రకటించిన నిర్ణయాను కొనసాగిస్తోంది. దేశ పౌరులకు కరెంట్, నీటి బిల్లులను ప్రభుత్వమే భరించనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com