సౌదీ:వేసవిలో పని వేళలకు సంబంధించి 450 చోట్ల నిబంధనల ఉల్లంఘన
- July 01, 2020రియాద్:వేసవిలో భగ్గున మండే ఎండల్లో కార్మికులకు విశ్రాంతి కల్పించాలన్న నిబంధనలు కొన్ని కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయి. అలా దాదాపు నిబంధనల ఉల్లంఘన కేసులను 450 వరకు గుర్తించినట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం చేపట్టిన తనిఖీల్లో ఉల్లంఘన కేసులు బయటపడ్డాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తగిలే ప్రాంతాల్లో పని చేయించకూడదని
మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు..విరామ సమయంలో కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది. అయితే..మంత్రిత్వ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా కార్మికులతో పని చేయిస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలు, సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ తనిఖీలు ఇక ముందు కూడా కొనసాగుతాయన్నారు. ఎవరైనా పనివేళల్లో నిబంధనలు పాటించకుంటే 19911కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కూడా అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్