సౌదీ:వేసవిలో పని వేళలకు సంబంధించి 450 చోట్ల నిబంధనల ఉల్లంఘన
- July 01, 2020
రియాద్:వేసవిలో భగ్గున మండే ఎండల్లో కార్మికులకు విశ్రాంతి కల్పించాలన్న నిబంధనలు కొన్ని కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయి. అలా దాదాపు నిబంధనల ఉల్లంఘన కేసులను 450 వరకు గుర్తించినట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం చేపట్టిన తనిఖీల్లో ఉల్లంఘన కేసులు బయటపడ్డాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తగిలే ప్రాంతాల్లో పని చేయించకూడదని
మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు..విరామ సమయంలో కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది. అయితే..మంత్రిత్వ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా కార్మికులతో పని చేయిస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలు, సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ తనిఖీలు ఇక ముందు కూడా కొనసాగుతాయన్నారు. ఎవరైనా పనివేళల్లో నిబంధనలు పాటించకుంటే 19911కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కూడా అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?