కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు
- July 03, 2020
ముంబై:బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ మృతి చెందారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.
సరోజ్ ఖాన్ కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసారు.
సరోజ్ ఖాన్ను మదర్ ఆఫ్ డ్యాన్స్, కొరియోగ్రఫీ ఆఫ్ ఇండియాగా అభిమానులు పిలిచేవారు. సరోజ్ ఖాన్ 40 ఏళ్ళ కెరియర్లో 2000కి పైగా సినిమాలు చేశారు. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ల వంటి స్టార్స్కి డ్యాన్స్ నేర్పించారు. దేవదాస్ మూవీలోని 'దోలా రే దోలా', తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన 'ఏక్ దో తీన్', జబ్ వీ మెట్ సినిమాలోని 'యే ఇష్క్ హై' పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. చివరిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







