కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ ఇకలేరు

- July 03, 2020 , by Maagulf
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ ఇకలేరు

ముంబై:బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ మృతి చెందారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.

సరోజ్ ఖాన్ కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసారు.

సరోజ్ ఖాన్‌ను మదర్ ఆఫ్ డ్యాన్స్, కొరియోగ్రఫీ ఆఫ్ ఇండియాగా అభిమానులు పిలిచేవారు. సరోజ్ ఖాన్ 40 ఏళ్ళ కెరియర్‌లో 2000కి పైగా సినిమాలు చేశారు. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల వంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించారు. దేవదాస్ మూవీలోని 'దోలా రే దోలా', తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన 'ఏక్ దో తీన్', జబ్ వీ మెట్ సినిమాలోని 'యే ఇష్క్ హై' పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. చివరిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com