ట్యాక్సీ ఓనర్స్, మహిళలకు లోన్ స్కీం ప్రకటించిన ఒమన్
- July 03, 2020మస్కట్:కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని రంగాలను ఆదుకునేందుకు ఒమన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు లోన్ స్కీం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా పూర్తి చేసినట్లు ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్ సీఈవో డాక్టర్ అబ్దుల్లాజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హినై తెలిపారు. ఈ లోన్ స్కీం ద్వారా ఫుల్ టైం ట్యాక్సీ నడిపేవారికి, డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారికి రుణాలు అందినున్నారు. అలాగే వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు కూడా లోన్ స్కీం ద్వారా లబ్ధిపొందనున్నారు. ముఖ్యంగా కాస్మటిక్ షాప్స్, బేబి సిట్టర్స్ కి రుణాలు ఇవ్వనున్నారు. ఇక కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులకు కూడా రుణాలు అందించనున్నారు. నాలుగేళ్లలో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు