ట్యాక్సీ ఓనర్స్, మహిళలకు లోన్ స్కీం ప్రకటించిన ఒమన్
- July 03, 2020
మస్కట్:కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని రంగాలను ఆదుకునేందుకు ఒమన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు లోన్ స్కీం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా పూర్తి చేసినట్లు ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్ సీఈవో డాక్టర్ అబ్దుల్లాజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హినై తెలిపారు. ఈ లోన్ స్కీం ద్వారా ఫుల్ టైం ట్యాక్సీ నడిపేవారికి, డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారికి రుణాలు అందినున్నారు. అలాగే వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు కూడా లోన్ స్కీం ద్వారా లబ్ధిపొందనున్నారు. ముఖ్యంగా కాస్మటిక్ షాప్స్, బేబి సిట్టర్స్ కి రుణాలు ఇవ్వనున్నారు. ఇక కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులకు కూడా రుణాలు అందించనున్నారు. నాలుగేళ్లలో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









