ట్యాక్సీ ఓనర్స్, మహిళలకు లోన్ స్కీం ప్రకటించిన ఒమన్
- July 03, 2020
మస్కట్:కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని రంగాలను ఆదుకునేందుకు ఒమన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు లోన్ స్కీం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా పూర్తి చేసినట్లు ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్ సీఈవో డాక్టర్ అబ్దుల్లాజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హినై తెలిపారు. ఈ లోన్ స్కీం ద్వారా ఫుల్ టైం ట్యాక్సీ నడిపేవారికి, డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారికి రుణాలు అందినున్నారు. అలాగే వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు కూడా లోన్ స్కీం ద్వారా లబ్ధిపొందనున్నారు. ముఖ్యంగా కాస్మటిక్ షాప్స్, బేబి సిట్టర్స్ కి రుణాలు ఇవ్వనున్నారు. ఇక కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులకు కూడా రుణాలు అందించనున్నారు. నాలుగేళ్లలో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







