బస్సును ఢీకొట్టిన రైలు, 29 మంది సిక్కు యాత్రికులు మృతి

- July 03, 2020 , by Maagulf
బస్సును ఢీకొట్టిన రైలు, 29 మంది సిక్కు యాత్రికులు మృతి

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైల్వేక్రాసింగ్ వద్ద బస్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 29 మంది సిక్కు యాత్రికులు మరణించారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షీకుపురా జిల్లా ఫరీదాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 35 మంది యాత్రికులు మినీ బస్సులో నంకానా సాహెబ్‌కు వెళ్లారు. అక్కడ ప్రార్థనల అనంతరం గురుద్వారా సచ్చ సౌధాకు వెళ్లారు. ఈ క్రమంలో ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఎక్స్‌ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టడడంతో బస్సు తునాతునకలయింది. రైలు పట్టాలకు ఇరువైపులా మృతదేహాలు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. 19 మంది స్పాట్‌లోనే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 10 మంద మరణించినట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com