దోహా మున్సిపాలిటిలో 129 ఆహార ఉత్పత్తి కేంద్రాల మూసివేత
- July 04, 2020దోహా:నిబంధనలు పాటించని, పాడైన ఆహారం కలిగి ఉన్న దాదాపు 129 ఆహార కేంద్రాలను దోహా మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు అహార ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన మున్సిపాలిటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దోహా మున్సిపాలిటి పరిధిలో మొత్తం 15 వేల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. పాక్షికంగా పాడైపోయి అనారోగ్య కారకంగా మారిన అహారాన్ని ఉత్పత్తి చేస్తున్న 588 మందికి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అలాగే 490 అహార ఉత్పత్తి కేంద్రాలకు జరిమానాలు విధించామని అన్నారు. అలాగే వివిధ మాంసం ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. 10.5 టన్నుల పాడైపోయిన మాంసాన్ని గుర్తించి దాన్ని నాశనం చేశారు. అలాగే అనారోగ్యం కలిగించే స్థితిలో ఉన్న 1.3 టన్నుల చేప మాంసాన్ని కూడా నాశనం చేసినట్లు మున్సిపాలిటి అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు