రెసిడెన్సీ వీసాలు ఉన్న ప్రవాసీయులు తిరిగి రావొచ్చు..కువైట్ స్పష్టీకరణ
- July 04, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ వివిధ దేశాల్లో ఉండిపోయిన కువైట్ రెసిడెన్సీ వీసాదారులు తిరిగి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం అవుతున్నాయని, అదే రోజు నుంచి అర్హత కలిగిన వీసాదారులు అంతా కువైట్ తిరిగి రావొచ్చని వెల్లడించింది. అయితే..కరోనా నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అనుసరిస్తున్న అన్ని మార్గదర్శకాలను రెసిడెన్సీ వీసాదారులు పాటించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందే కరోనా సోకలేదని నిరూపించుకునేందుకు గుర్తింపు పొందిన పీసీఆర్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. అలాగే విమానం ఎక్కే ముందే శ్లోనిక్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ చేరుకున్నాక స్వీయ గృహ నిర్బంధంలోగానీ, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాల్లోగాని ఉండేందుకు అంగీకరిస్తూ ముందస్తుగానే సంతకాలు చేయాలని కూడా షరతు విధించింది.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







