రెసిడెన్సీ వీసాలు ఉన్న ప్రవాసీయులు తిరిగి రావొచ్చు..కువైట్ స్పష్టీకరణ
- July 04, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ వివిధ దేశాల్లో ఉండిపోయిన కువైట్ రెసిడెన్సీ వీసాదారులు తిరిగి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం అవుతున్నాయని, అదే రోజు నుంచి అర్హత కలిగిన వీసాదారులు అంతా కువైట్ తిరిగి రావొచ్చని వెల్లడించింది. అయితే..కరోనా నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అనుసరిస్తున్న అన్ని మార్గదర్శకాలను రెసిడెన్సీ వీసాదారులు పాటించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందే కరోనా సోకలేదని నిరూపించుకునేందుకు గుర్తింపు పొందిన పీసీఆర్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. అలాగే విమానం ఎక్కే ముందే శ్లోనిక్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ చేరుకున్నాక స్వీయ గృహ నిర్బంధంలోగానీ, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాల్లోగాని ఉండేందుకు అంగీకరిస్తూ ముందస్తుగానే సంతకాలు చేయాలని కూడా షరతు విధించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







