సౌదీ, యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్..ఇండియన్స్ నుంచి భారీగా బంగారం పట్టివేత

- July 04, 2020 , by Maagulf
సౌదీ, యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్..ఇండియన్స్ నుంచి భారీగా బంగారం పట్టివేత

కరోనాతో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్వదేశానికి వస్తూ భారీగా బంగారంతో ఇండియాకి చేరుకున్న 14 మంది ప్రవాస భారతీయులు ఇండియన్ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. 14 మంది నుంచి Dh7.7 మిలియన్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రస్ అల్ ఖైమా నుంచి ఇండియా చేరుకున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 9.33 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 45 లక్షలు. సౌదీ నుంచి వచ్చిన మరో 11 మంది నుంచి 22.652 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్స్ లో అమర్చారు. అయితే..అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయటంతో బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com