సౌదీ, యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్..ఇండియన్స్ నుంచి భారీగా బంగారం పట్టివేత
- July 04, 2020
కరోనాతో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్వదేశానికి వస్తూ భారీగా బంగారంతో ఇండియాకి చేరుకున్న 14 మంది ప్రవాస భారతీయులు ఇండియన్ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. 14 మంది నుంచి Dh7.7 మిలియన్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రస్ అల్ ఖైమా నుంచి ఇండియా చేరుకున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 9.33 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 45 లక్షలు. సౌదీ నుంచి వచ్చిన మరో 11 మంది నుంచి 22.652 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్స్ లో అమర్చారు. అయితే..అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయటంతో బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







