కువైట్:ఆరోగ్య సిబ్బంది వారి రెసిడెన్సీ వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రావచ్చు
- July 05, 2020కువైట్ సిటీ:వైద్య శాఖ స్పాన్సర్ షిప్ లో పని చేస్తున్న ప్రవాస వైద్యరంగ నిపుణుల్ని కువైట్ ప్రభుత్వం సాదరంగా అహ్వానిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే..హెల్త్ స్టాఫ్ కువైట్ రావొచ్చని స్పష్టమైన ప్రకటన చేసింది. వైద్య శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల కరోనాకు ముందు వివిధ కారణాలతో వారి సొంత దేశాలకు వెళ్లారని కువైట్ వైద్య శాఖ వెల్లడించింది. అయితే..లాక్ డౌన్ మార్చిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లంతా ఆయా దేశాల్లోనే ఉండిపోయారు. అలా దాదాపు 1000 మంది డాక్టర్లు, నర్సులు, రేడియాలజి టెక్నిషియన్లు కువైట్ రాలేకపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే కావటం విశేషం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన హెల్త్ స్టాఫ్ కు కువైట్ అహ్వానం పలుకుతోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే వైద్య రంగ నిఫుణులు రావొచ్చని, అలాగే తమ వెంట కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!