WHOకి 239 మంది శాస్త్రవేత్తల లేఖ
- July 06, 2020జెనీవా:తుమ్మిన లేదా దగ్గినప్పుడు ముక్కు లేదా నోటి నుంచి వెలువడే తుంపర్లు ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(who) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓకి 239 మంది శాస్త్రవేత్తలు లేఖ రాశారు. గాలిలో చిన్న కణాలలోని కరోనావైరస్ ప్రజలను ప్రభావితం చేస్తుందని.. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని.. సిఫారసులను సవరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు పిలుపునిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ శనివారం నివేదించింది. వచ్చే వారం ఒక శాస్త్రీయ పత్రికలో పరిశోధకులు ప్రచురించాలని యోచిస్తున్న ఏజెన్సీకి రాసిన బహిరంగ లేఖలో, 32
దేశాలలో 239 మంది శాస్త్రవేత్తలు.. చిన్న కణాల ద్వారా ప్రజలకు కరోనా సోకుతుందని చూపించే ఆధారాలను వివరించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రముఖ న్యూస్ ఏజన్సీ రాయిటర్స్ పేర్కొంది. కరోనా వ్యాధి గ్రస్తులు తుమ్మినా లేదా దగ్గిన తర్వాత వెలువడే కణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయని.. ఇది మరొక వ్యక్తికి వైరస్ సోకడానికి కారణమవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వారి లేఖలో పేర్కొన్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే కరోనావైరస్ యొక్క బరువు అధికంగా ఉండటం వలన వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..