WHOకి 239 మంది శాస్త్రవేత్తల లేఖ
- July 06, 2020
జెనీవా:తుమ్మిన లేదా దగ్గినప్పుడు ముక్కు లేదా నోటి నుంచి వెలువడే తుంపర్లు ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(who) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓకి 239 మంది శాస్త్రవేత్తలు లేఖ రాశారు. గాలిలో చిన్న కణాలలోని కరోనావైరస్ ప్రజలను ప్రభావితం చేస్తుందని.. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని.. సిఫారసులను సవరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు పిలుపునిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ శనివారం నివేదించింది. వచ్చే వారం ఒక శాస్త్రీయ పత్రికలో పరిశోధకులు ప్రచురించాలని యోచిస్తున్న ఏజెన్సీకి రాసిన బహిరంగ లేఖలో, 32
దేశాలలో 239 మంది శాస్త్రవేత్తలు.. చిన్న కణాల ద్వారా ప్రజలకు కరోనా సోకుతుందని చూపించే ఆధారాలను వివరించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రముఖ న్యూస్ ఏజన్సీ రాయిటర్స్ పేర్కొంది. కరోనా వ్యాధి గ్రస్తులు తుమ్మినా లేదా దగ్గిన తర్వాత వెలువడే కణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయని.. ఇది మరొక వ్యక్తికి వైరస్ సోకడానికి కారణమవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వారి లేఖలో పేర్కొన్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే కరోనావైరస్ యొక్క బరువు అధికంగా ఉండటం వలన వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







