WHOకి 239 మంది శాస్త్రవేత్తల లేఖ
- July 06, 2020
జెనీవా:తుమ్మిన లేదా దగ్గినప్పుడు ముక్కు లేదా నోటి నుంచి వెలువడే తుంపర్లు ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(who) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓకి 239 మంది శాస్త్రవేత్తలు లేఖ రాశారు. గాలిలో చిన్న కణాలలోని కరోనావైరస్ ప్రజలను ప్రభావితం చేస్తుందని.. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని.. సిఫారసులను సవరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు పిలుపునిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ శనివారం నివేదించింది. వచ్చే వారం ఒక శాస్త్రీయ పత్రికలో పరిశోధకులు ప్రచురించాలని యోచిస్తున్న ఏజెన్సీకి రాసిన బహిరంగ లేఖలో, 32
దేశాలలో 239 మంది శాస్త్రవేత్తలు.. చిన్న కణాల ద్వారా ప్రజలకు కరోనా సోకుతుందని చూపించే ఆధారాలను వివరించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రముఖ న్యూస్ ఏజన్సీ రాయిటర్స్ పేర్కొంది. కరోనా వ్యాధి గ్రస్తులు తుమ్మినా లేదా దగ్గిన తర్వాత వెలువడే కణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయని.. ఇది మరొక వ్యక్తికి వైరస్ సోకడానికి కారణమవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వారి లేఖలో పేర్కొన్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే కరోనావైరస్ యొక్క బరువు అధికంగా ఉండటం వలన వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







