కువైట్-ఇండియా మధ్య కొనసాగనున్న చార్టర్డ్ విమానాలు
- July 06, 2020
కువైట్ సిటీ:అల్ తాయెర్ గ్రూప్, కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు మరిన్ని చార్టర్ విమానాల్ని నడపనుంది. కువైట్ ఎయిర్ వేస్ విమానం ఢిల్లీకి 322 మంది ప్రయాణీకులతో కూడిన విమానాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపింది. మరో కువైట్ ఎయిర్వేస్ విమానం ముంబైకి 268 మంది ప్రయాణీకుల్ని తీసుకెళ్ళింది. అల్ తాయెర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ వీటిని ఏర్పాటు చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల కారణంగా చార్టర్డ్ విమానాల నిర్వహణ కొంత ఆలస్యమవుతోంది. కాగా, ముంబైకి విమానాన్ని నడిపే క్రమంలో చొరవ చూపిన ఆదిత్య ఠాక్రేకి లగ్జరీ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ బాబీ థామస్ కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వివేక్ గైక్వాడ్ అలాగే తహసిల్దార్ అయుబ్ రషీద్ తంబోలీకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చార్టర్డ్ విమానాల్ని నడుపుతామని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







