కువైట్-ఇండియా మధ్య కొనసాగనున్న చార్టర్డ్ విమానాలు
- July 06, 2020
కువైట్ సిటీ:అల్ తాయెర్ గ్రూప్, కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు మరిన్ని చార్టర్ విమానాల్ని నడపనుంది. కువైట్ ఎయిర్ వేస్ విమానం ఢిల్లీకి 322 మంది ప్రయాణీకులతో కూడిన విమానాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపింది. మరో కువైట్ ఎయిర్వేస్ విమానం ముంబైకి 268 మంది ప్రయాణీకుల్ని తీసుకెళ్ళింది. అల్ తాయెర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ వీటిని ఏర్పాటు చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల కారణంగా చార్టర్డ్ విమానాల నిర్వహణ కొంత ఆలస్యమవుతోంది. కాగా, ముంబైకి విమానాన్ని నడిపే క్రమంలో చొరవ చూపిన ఆదిత్య ఠాక్రేకి లగ్జరీ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ బాబీ థామస్ కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వివేక్ గైక్వాడ్ అలాగే తహసిల్దార్ అయుబ్ రషీద్ తంబోలీకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చార్టర్డ్ విమానాల్ని నడుపుతామని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







