తెలంగాణలో 11 కరోనా మరణాలు
- July 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారంగా ఈ సంఖ్య మరింత తీవ్రమైంది.సోమవారం ఒక్కరోజే 1,831 కేసులు నమోదు కాగా 11 మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 25,733 మంది కరోనా బారిన పడ్డారు.మొత్తం 306 మంది చనిపోయారు.ఇంకా 10,646 కేసులు యాక్టివ్ ఉన్నాయి.కరోనా సోకి చికిత్స పొంది తాజాగా 2,078 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 14,781 మంది డిశ్చార్జి అయ్యారు.
GHMC పరిధిలోనే 1,419 మందికి పాజిటివ్ రాగా రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117, సంగారెడ్డిలో 3, కరీంనగర్లో 5,మహబూబ్ నగర్లో 9, గద్వాల్లో 1, నల్గొండలో 9, వరంగల్ అర్బన్లో 9, నిజామాబాద్ లో 9, వికారాబాద్లో 7,మెదక్లో 20, నారాయణపేట్లో 1, పెద్దపల్లిలో 9, యాదాద్రిలో 1, సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 20, జగిత్యాలలో 4, మహబూబాబాద్లో ఒక్క కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లండించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?