దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ప్రాంగణం పై హక్కు లేదు.

- February 03, 2016 , by Maagulf
దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ప్రాంగణం పై హక్కు లేదు.

  దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ఉన్న  ప్రాంగణం పై వారికి ఏ రిజర్వు  హక్కు లేదని,  
  అది సైతం ప్రజా పార్కింగ్ పరిధి లోనికి వస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖాధికారులు ఒక ప్రకటనలో 
  తెలిపారు. అత్యధిక శాతం మంది దుకాణ యజమానులు, ప్రైవేటు సంస్థల వారు తమ ఎదుట ఉన్న స్థలం 
  తమ స్వంతమని , తమ సిబ్బంది మినహా వేరే వారెవరు తమ ఎదుట పార్కింగ్ చేయకూడదని ఆంక్షలు 
  పెట్టడం సరి కాదని అన్నారు. ప్రజలందిరికి చెందిన ఆ ప్రదేశాలను ఆక్రమించి అది తమకె హక్కుగా 
  ఉందని వారు వ్యహరించడం నేరమని, ఆ విధంగా ప్రవర్తించిన యజమానుల గూర్చి ఎవరైనా పిర్యాదు 
  చేస్తే, సంబంధిత దుకాణ,  ప్రైవేటు యజమానులకు తక్షణమే 300 ఖతర్ రియళ్లను జరిమానాగా 
  విధిస్తామని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. వారికి ప్రజా పార్కింగ్ స్థలాలపై ఎటువంటి 
  చట్టపరమైన హక్కు లేదని  వారు తెలిపారు.
               

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com