కువైట్:కార్మికులపై లాక్ డౌన్ ఎఫెక్ట్..జీతాల కోసం ఆందోళన
- July 08, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని వివిధ రంగాల్లోని కార్మికులపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పలు కంపెనీలు కొన్నాళ్లుగా మూతపడటంతో ఆయా రంగాల్లోని కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్ లోని సల్మియా ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో పని చేసే కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో ఆ గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్లో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా రెస్టారెంట్ మూతపడటంతో తమకు జీతాలు ఇవ్వటం లేదని, కనీసం పూట గడిచేందుకు కూడా డబ్బులు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే..రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడి జీతాలు ఇప్పించేలా ప్రయత్నిస్తామని సల్మానియా పోలీసులు కార్మికులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్మికుల సమస్యను సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు నివేదించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









