కువైట్:కార్మికులపై లాక్ డౌన్ ఎఫెక్ట్..జీతాల కోసం ఆందోళన
- July 08, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని వివిధ రంగాల్లోని కార్మికులపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పలు కంపెనీలు కొన్నాళ్లుగా మూతపడటంతో ఆయా రంగాల్లోని కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్ లోని సల్మియా ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో పని చేసే కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో ఆ గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్లో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా రెస్టారెంట్ మూతపడటంతో తమకు జీతాలు ఇవ్వటం లేదని, కనీసం పూట గడిచేందుకు కూడా డబ్బులు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే..రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడి జీతాలు ఇప్పించేలా ప్రయత్నిస్తామని సల్మానియా పోలీసులు కార్మికులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్మికుల సమస్యను సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు నివేదించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







