కర్ఫ్యూ నుంచి మినహాయింపునకు ఆస్పత్రి వెళ్లిన ఆధారాలు తప్పనిసరి చేసిన కువైట్
- July 08, 2020
కువైట్ సిటీ:ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కర్ఫ్యూ సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్రకటించింది కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ. కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందెందుకు వారు వెళ్తున్న ఆస్పత్రి, హెల్త్ సెంటర్ వివరాలను తప్పనిసరిగా తమ దరఖాస్తులో తెలుపాల్సి ఉంటుంది. దరఖాస్తుల కోసం మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. https://curfew.paci.gov.kw ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు..అనుమతి పొందిన వ్యక్తులు...తాము ఆస్పత్రి, హెల్త్ సెంటర్ లో విజిట్ చేసిన తర్వాత చికిత్స వివరాలను కూడా వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. ఇలా అప్ డేట్ చేయటం ద్వారా భవిష్యత్తులో కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లిన వివరాలను నమోదు చేయకుంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు రద్దు అవుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?