తెలంగాణ లో కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు

- July 08, 2020 , by Maagulf
తెలంగాణ లో కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు. ఇక కొత్తగా 992 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29536 కి చేరింది. ఇందులో 17 వేల 279 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 11 వేల 933 యాక్టీవ్ కేసులున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 324 మంది కరోనాతో చనిపోయారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com