కువైట్:ధృవీకరణ పత్రాల కోసం ఆన్ లైన్ బుకింగ్..
- July 09, 2020
కువైట్ సిటీ:వివిధ ధృవీకరణ పత్రాల జారీ కోసం ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించినట్లు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రవాసీయులు ఇక నుంచి ఎలాంటి ధృవీకరణ పత్రాలు కావాలన్న ముందుగా https://www.mofa.gov.kw/ వెబ్ సైట్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని సూచించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రవాసీయులకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్ ఇలా అన్ని సర్టిఫికెట్ల సేవలు షువైఖ్ లోని విదేశీ వ్యవహారాల ప్రధాన బిల్డింగ్ లో మాత్రమే జారీ చేస్తునట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే..ఆన్ లైన్ అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకునేవారికి కొన్ని సూచనలు చేశారు. దరఖాస్తుదారుడు అపాయింట్మెంట్ బుకింగ్ స్లాట్ సమయానికి ఆఫీస్ కు చేరుకోవాలని, ఆ తర్వాత ఓ 15 నిమిషాలు ఆలస్యంగా వారికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 15 నిమిషాలు దాటితే దరఖాస్తుదారుడి అపాయింట్మెంట్ రద్దు అవుతుంది. అలాగే కరోనా నేపథ్యంలో ప్రతి దరఖాస్తుదారుడు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. టెంపరేచర్ 37.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే వారిని ఎట్టిపరిస్థితుల్లో లోనికి అనుమతించరు. అలాగే పరిపాలన విభాగాల్లోకి దరఖాస్తుదారుడు వెళ్లకూడదు. ఇక విజిటర్లు ఖచ్చితంగా తాము ఏ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలను వారే తమ వెంట తీసుకురావాలి. అఫీసులో ఫోటోకాపీ సౌకర్యం కల్పించటం లేదని కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









