అబుధాబిలో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు పున:ప్రారంభం..
- July 09, 2020
అబుధాబి:కరోనా ఎఫెక్ట్ తో గత మార్చి నుంచి నిలిచిపోయిన పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అబుధాబిలోని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవలపై ఇప్పటివరకు ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి అబుధాబిలోని అన్ని బీఎల్ఎస్ కేంద్రాల్లో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు అందుబాటులోకి వస్తాయని రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. అయితే..60 ఏళ్లు దాటిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఆఫీసుకు హజరయ్యేవారు మాత్రం ఖచ్చితంగా కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







