అబుధాబిలో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు పున:ప్రారంభం..

- July 09, 2020 , by Maagulf
అబుధాబిలో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు పున:ప్రారంభం..

అబుధాబి:కరోనా ఎఫెక్ట్ తో గత మార్చి నుంచి నిలిచిపోయిన పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అబుధాబిలోని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవలపై ఇప్పటివరకు ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి అబుధాబిలోని అన్ని బీఎల్ఎస్ కేంద్రాల్లో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు అందుబాటులోకి వస్తాయని రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. అయితే..60 ఏళ్లు దాటిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఆఫీసుకు హజరయ్యేవారు మాత్రం ఖచ్చితంగా కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com