అబుధాబిలో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు పున:ప్రారంభం..
- July 09, 2020అబుధాబి:కరోనా ఎఫెక్ట్ తో గత మార్చి నుంచి నిలిచిపోయిన పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అబుధాబిలోని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవలపై ఇప్పటివరకు ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి అబుధాబిలోని అన్ని బీఎల్ఎస్ కేంద్రాల్లో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు అందుబాటులోకి వస్తాయని రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. అయితే..60 ఏళ్లు దాటిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఆఫీసుకు హజరయ్యేవారు మాత్రం ఖచ్చితంగా కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్