భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- July 09, 2020 , by Maagulf
భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు

భారత దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే అత్యధికంగా 24,879 మందికి కరోనా వైరస్ సోకింది. మరో వైపు గడిచిన 24 గంటల్లోనే 487 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 269789 ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 476378 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 21129గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com